Saturday, August 7, 2010

Nandikeswararao Lokanadham , నందికేస్వరరావు లోకనాధం


--

ప్రతి మనిసిలో ఎదోఒక కళ ఉంటుంది , సాధన , కౄషిల సమన్వయము తో రాణిస్తారు . నందికేశ్వరరావు శ్రీకాకుళం పట్నానికి చెందిన మిమిక్రీ కళాకారుడు . మిమిక్రీ తో విభిన్న ధ్యనులను పలికించి సమ్మోహన పరిచే మాంత్రికుడు గా , అహూతులను అలరించే వినోధ సృస్టికర్తగా పేరు గాంచారు . శ్రీకాకుళం లో పుట్టి పెరిగి మిత్రులు , గురువులు సాయం తో సాధన చేసి అంతర్జాతీయ స్థాయిలో వేలాది ప్రదర్శనలిచ్చి ఎన్నో సత్కారాలు పొందేరు .

రచయితగా , నటుడిగా , చిత్రకళోపాధ్యాయునిగా , పసిద్ధ ధ్వనుఅనుకరణ కళాకారునిగా పేరుపొందిన నందికేశ్వరరావు డా.నేరెళ్ళ స్పూర్తితో స్వరమాంత్రికుడి ఏకలవ్య శిష్యునిగా పదిహేనేళ్ళ ప్రాయం లోనే ధ్వనులను అనుకరించడం ప్రారంభించారు . పాతశ్రీకాకుళం లోని తన ఇంటిదరిలోచెట్లపై పొద్దున్నే కిలకిల రావాలు చేసే పక్షుల ధ్వనులను పరిశీలించేవారు . నిరంతర సాధన కృషితో మిమిక్రీ కళాకారునిగా పేరు పొంది ఎందరో శిష్యులను తయారుచేశారు . మిమిక్రీ శ్రీనివాస్ , సూర్యారావు తో పాటు విశాఖపట్నం లోను , ఇతర జిల్లాలలోను ఆయన శిష్యులున్నారు .

అవార్డులు :
  • ఉత్తమ మిమిక్రీ కళాకారునిగా ఎనిమిది సార్లు పురస్కారాలు ,
  • రాష్ట్ర స్థాయిలో మూడు బంగారు పతకాలు పొందేరు ,
  • జిల్లా సాక్షరత సమితి శిబిరం లో సత్కారాలు ,
  • గుజరాత్ లొ జరిగిన నెహ్రూ యువకేంద్రం శిక్షణ శిబిరం లో పురస్కారాలు పొందినారు ,
  • ఎం.టి.అర్ , అక్కినేని , చిరంజీవి , అల్లు రామలింగయ్య , సుత్తివేలు , కోటా శ్రీనివాసరావు , బ్రహ్మానందం , వంటి స్నినీ ప్రముఖుల చేతులమీదుగా సత్కారాలు అందుకున్నారు .
  • మర్రి చెన్నారెడ్డి , పి.వి.నరసింహారావు , జె.వెంగళరావు , చంద్రబాబునాయుడు వంటి రాజకీయ ప్రముఖులు సత్కరించారు .
  • ఉత్తమ ఉపాధ్యాయుని గా ప్రభుత్వము సత్కరించినది .

(మూలము : ఈనాడు దినపత్రిక )
  • =======================================
Visit my website -> Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment