Sunday, February 14, 2010

బలివాడ కాంతారావు , Balivada Kantharao









బలివాడ కాంతారావు ( 1927, జూలై 3 - 2000, మే 6 ) సుప్రసిద్ధ తెలుగు నవలా రచయిత. ఈయన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలోని మడపాం అనే గ్రామంలో జన్మించాడు. భారత సైన్యంలో వివిధ కేడర్లలో పని చేశాడు. 38 దాకా నవలలు రాశాడు. ఇంకా 400 దాకా కథలు, 5 నాటికలు, రేడియో నాటికలు రచించాడు. ఈయన రచనలపై కొద్దిమంది పరిశోధనలు కూడా చేశారు. అదే విధంగా ఈయన రచనలు ఇతర భారతీయ భాషలలోకి కూడా అనువదించబడ్డాయి. 1998లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. ఇంకా చాలా అవార్డులు ఈయన్ని వరించాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం, గోపీచంద్ సాహిత్య పురస్కారం, రావిశాస్త్రి స్మారక పురస్కారం, కళాసాగర్ విశిష్ట పురస్కారం ముఖ్యమైనవి. ఐదు దశాబ్దాలపాటు ఏకధాటిగా రచనలు చేసినా, ఏ దశలోనూ ప్రమాణాలపై రాజీ పడలేదు. ఆయన గుణగణాలైనటువంటి నిజాయితీ, నిక్కచ్చితనం, జాలి, దయ, కరుణ మొదలైనవి ఆయన రచనల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.

రచనలు

* జన్మ భూమి
* అమ్మి
* కావడి కుండలు - 1951
* దొంగలు - 1952
* శిశు విక్రయం - 1952
* పెళ్ళి -1953
* అంతరాత్మ- 1957
* ఇంటికోసం - 1967
* మంటలు - 1968
* ముంగిస కథ - 1969
* నాలుగు మంచాలు 1972 (ఆంధ్ర సచిత్ర వార పత్రికలో ధారావాహికం)
* విలువెంత - 1975
* దగాపడిన తమ్ముడు - ?
* నిగురు తేనె - 1977
* భేదాఘాట్ మొసలి - 1977
* షోవనార (1980)
* కెంపు (1984)
* తేనె పట్టు (1989)
* సుఖ జీవనం (1989)
* ప్రతీక్ష (1990)
* దృష్టి (1991)
* చక్రతీర్థం (1992)
* గోపురం (1994)
* చైత్ర పర్వం (1998)
* తెల్ల కలువ (1998)
* దేవుళ్ళ దేశం (1998)
* Love in Goa (1998)
* అజంతా (1998)
* ఎల్లోరా (1998)







  • ==================================================

Visit my website -> Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment