Monday, February 15, 2010

కరణం మల్లేశ్వరి , Karanam Malleswari








కరణం మల్లేశ్వరి తెలుగు వారు గర్వించదగిన వ్యక్తి. శ్రీకాకుళంకు చెందిన ఈమె బరువులు ఎత్తడం ఆటలో ఒలింపిక్ పతకం సాధించి ప్రసిద్ధురాలయ్యింది. ఈమె 1975 జూన్ 1 న జన్మించింది. చిత్తూరు జిల్లా తవణంపల్లి గ్ర్రామములో పుట్టిన మాల్లీశ్వరి తండ్రి ఉద్యోగరీత్యా ఆమదాలవలకు వచ్చారు , ఇక్కడే సెటిల్ అయ్యారు .. మల్లీశ్వరి అక్క నరసమ్మకు జాతీయ వెయిట్ లిఫ్టింగ్ మాజీ కోచ్ నీలంశెట్టి అప్పన్న శిక్షణ ఇచ్చేవారు . అక్క విజయాలను చూచిన మల్లీశ్వరి కూడా ఈ రంగం పై ఆసక్తి పెంచుకున్నారు . చివరకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నారు . చైనా దేశం లొని గ్యాంగ్ ఝూ లో జరిగిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ పోతీల్లో 54 కిలోల విభాగం లో దేశానికి మూడు స్వర్ణపతకాలు తెచ్చరు . ఆ తరువాత టర్కీ రాజధాని ఇస్తాంహుల్ లో జరిగిన పోటేల్లో తన ప్రత్యర్ధి చైనా క్రీడాకారిణి డ్రగ్స్ తీసుకున్నట్లు రుజువుకావడం తో ఆ టైటిల్ ను మల్లీశ్వరికి ప్రధానము చేసారు . 1995 చైనాలో జరిగిన పోతీల్లో వరుసగా 105,110, 113, కిలోల బరువులు ఎత్తి చైనా వెయిట్ లిఫ్టర్ - లాంగ్ యాపింగ్ పేరున ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొటారు .

  • సిడ్నీలో జరిగిన 2000 ఒలింపిక్ క్రీడలలో వెయిట్ లిఫ్టింగ్ పోటీలో కాంస్య పతకం సాధించింది. ఆ విధంగా ఒలింపిక్ ఆటలలో పతకం సాధించిన మొదటి భారతీయ మహిళ అయ్యింది, మరియు మూడవ భారతీయ వ్యక్తి. (అంతకుముందు పతకాలు సాధించిన భారతీయులు - 1952 హెల్సింకీ లో bantamweightwrestler ఖషబా జాదవ్, మరియు 1996 అట్లాంటాలో టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్)

పతకాలు, పురస్కారాలు

  • 2000 - ఒలింపిక్ క్రీడలు - కాంస్య పతకం - 69 కిలోగ్రాముల విభాగంలో
  • 1994 - ఇస్తాంబుల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీలు - బంగారు పతకం
  • 1995 - పూసాన్, కొరియా - ఆసియా ఛాంపియన్‌షిప్ పోటీలు
  • 1995 - ఘుంగ్‌జౌ, చైనా - 54 కిలోల విభాగంలో మూడు బంగారు పతకాలు

భారత ప్రభుత్వం అర్జున అవార్డు
  • 1995 - రాజీవ్ గాంధీ ఖేల్ రత్న బహుమతి
  • 1999- పద్మశ్రీ పురస్కారం

ఒక సందర్భంలో ఆమె ఇలా అంది -

  • భారత దేశానికి పతకాలు ఎందుకు రావని అడుగుతుంటారు. అది ఎయిర్-కండిషన్డ్ గదులలో కూర్చుని మాట్లాడినంత సులభం కాదు. ఆ ప్రయత్నంలో ఉన్న శ్రమ, వేదన మాకు తెలుస్తాయి...






  • ===================================================

Visit my website -> Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment