Sunday, February 14, 2010

Tapi dharmaravu naidu ,తాపీ ధర్మారావు నాయుడు





తాపీ ధర్మారావు నాయుడు (Tapi Dharma Rao Naidu) తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు, హేతువాది మరియు నాస్తికుడు .

జీవిత చరిత్ర

ధర్మారావు 1887 సంవత్సరంలో సెప్టెంబరు 19న ప్రస్తుతం ఒరిస్సాలో ఉన్న బెర్హంపూరు (బరంపురం-శ్రీకాకుళము కలిసి ఉండేది) లోని ఒక తెలుగు కుటుంబములో జన్మించాడు. ఈయన మాలపిల్ల, రైతుబిడ్డ మొదలైన సినిమాలకు సంభాషణలు రాశాడు. ఈయన ప్రాధమిక విద్యను శ్రీకాకుళంలో, మెట్రిక్యులేషన్ విజయవాడలో, పర్లాకిమిడిలో ఎం.ఏ. వరకు చదువుకొని మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో చేరాడు. పర్లాకిమిడిలో చదివే రోజులలో వ్యవహారిక భాషావేత్త అయిన గిడుగు రామ్మూర్తి ఈయనకు గురువు కావటం విశేషం. ధర్మారావు తల్లిన పేరు నరసమ్మ. తండ్రి అప్పన్న. వీరి ఇంటి పేరు మొదట్లో "బండి" లేదా "బండారు" కావచ్చును. అప్పన్న తాత లక్ష్మయ్య కొంతకాలం మిలిటరీలో పని చేశాడు. తరువాత తాపీ పనిలో మంచి పేరు తెచ్చుకొన్నాడు. అలా అతనికి శ్రీకాకుళంలో "తాపీ లక్ష్మయ్యగారు" అన్న పేరు స్థిరపడిపోయిందట. కల్లికోట రాజావారి కళాశాలలో గణిత ఉపాధ్యాయులుగా పనిచేశాడు. 1910 ప్రాంతంలో కొందరు మిత్రులతో కలిసి బరంపురంలో వేగుచుక్క గ్రంథమాలను స్థాపించాడు. ఇతని తొలి రచన 1911లో 'ఆంధ్రులకొక మనవి' అనే పేరుతో విలువడింది. పత్రికా నిర్వహణలో ఇతని నేర్పు అనన్య సామాన్యమైనది. 'కొండెగాడు', 'సమదర్శిని', 'జనవాణి', 'కాగడా' మొదలైన పత్రికలు ఇతని ప్రతిభకు నిదర్శనాలు. ఇతను 1973 మే 8న మరణించాడు. తెలుగు సినిమా దర్శకులు తాపీ చాణక్య ఇతని కుమారుడు.


విశేషాలు
  • ఉమ్మడి రాష్ట్రంగా వున్న రోజుల్లో బొబ్బిలి రాజా వారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు- ధర్మారావుగారు ఆయన దగ్గర కార్యదర్శిగా పనిచేశారు.
  • ఆంధ్ర రాష్ట్ర పత్రికా రచయితల మహాసభ జరిగినప్పుడు తాపీవారే మొదటి అధ్యక్షులు.
  • 'మాలపిల్ల' (1938) సినిమాకు కథ అందించినది- గుడిపాటి వెంకటచలం.
  • తాపీని గౌరవంగా 'తాతాజీ' అని పిలిచేవారు.
  • తాపీ ధర్మారావు ఎప్పుడు జన్మించారు--1897, సెప్టెంబరు 19.
  • తాపీ ధర్మారావు జన్మించిన ప్రదేశం--బరంపురం.
  • తాపీ ధర్మారావు ఏ పేరుతో ప్రసిద్ధి చెందినారు--తాతాజీ.
  • తాపీ ధర్మారావు ఆత్మకథ--రాళ్ళూ-రప్పలు.
  • తాపీ ధర్మారావు ఏ తెలుగు చిత్రాలకు సంభాషణలు రాశారు--మాలపిల్ల, ద్రోహి, రైతుబిడ్డ.
  • తాపీ ధర్మారావు రచనలపై పరిశోధనచేసి డాక్టరేట్ పొందినది--ఏటుకూరి ప్రసాదరావు.
  • సాహిత్యరంగంలో సేవలకుగాను ధర్మారావు పొందిన అవార్డు--సాహిత్య అకాడమీ అవార్డు (1971).
  • ధర్మారావు గురువు--గిడుగు రామమూర్తి.
  • తాపీ ధర్మారావు శతజయంతి సందర్భంగా 1987లో ఆయన జీవితకథను పుస్తకంగా తెచ్చిన అతని కుమారుడు--తాపీ మోహన్‌రావు.
  • తాపీ ధర్మారావు ఎప్పుడు మరణించారు--1972, మే 8.


రచనలు

1. ఆంధ్రులకొక మనవి
2. దేవాలయాలపై బూతుబొమ్మలు ఎందుకు? 1936
3. పెళ్ళి దానిపుట్టుపూర్వోత్తరాలు 1960
4. ఇనుపకచ్చడాలు
5. సాహిత్య మొర్మొరాలు
6. రాలూ రప్పలూ
7. మబ్బు తెరలు
8. పాతపాళీ
9. కొత్తపాళీ
10. ఆలిండియా అడుక్కుతినేవాళ్ళ మహాసభ
11. విజయవిలాసం వ్యాఖ్య
12. అక్షరశారద ప్రశంస
13. హృదయోల్లాసము
14. భావప్రకాశిక
15. నల్లిపై కారుణ్యము
16. విలాసార్జునీయము
17. ఘంటాన్యాయము
18. అనా కెరినీనా
19. ద్యోయానము
20. భిక్షాపాత్రము
21. ఆంధ్ర తేజము
22. తప్తాశ్రుకణము


  • =====================================================

Visit my website -> Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment