సమాజాన్ని ఆలోచింపజేసే కళల్లో చిత్రలేఖనం ఒకటి , ఇది దేవతా విధ్యలైన 64 కళలలో ఒకటి .. ఆ విధ్యలో రాణించడం ఓ విలక్షణ , విశిస్టత . అంకితభావము తో పనిచేస్తే అద్భుతాలు సృస్టించవచ్చు .
వెంకటరమణ 2002 లో పదవీ విరమణ పొదిననాటి నుండి అదే పనిగా ఎన్నో చిత్రాలు వేస్తున్నారు . చిత్రలేఖనానికి , శిల్పాల తయారీకి తన ఇంట్లో ప్రత్యేక గదులు ఏర్పరిచేరు . ఆసక్తి గల విధ్యార్దులకు చిత్రలేఖనం లొ మెలకువలు నేర్పిస్తూ ఉన్నారు . ఉత్తం ఉపాధ్యాయునిగా , అక్షరక్రాంతి , జన్మభూమి ప్రోత్సాహకునిగా , చిత్రలేఖన శిక్షకునిగా ఆయన సేవలు శ్లాఘనీయము , శ్రీకాకులం జిల్లలో నేటికి చిత్ర , కళా , నాటక రంగానికి అలుపెరగని యోధునిగా అవిశ్రాంతము గా సేవలు అందిస్తూ అతి సామాన్య జీవితం గడుపుతున్నారు .
అవార్డులు :
- రాస్ట్ర ఉత్తమ చిత్రలేఖన ఉపాధ్యాయునిగా 2002 లో అప్పటి ముఖ్యమంత్రి రానా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా రవీంద్రభారతిలో అవార్డునందుకున్నారు .
- 2001 - 2002 ఉత్తమ ఉపాధ్యాయునిగాజిల్లా అవార్డు ఎంపికై కలెక్టర్ , జిల్లా విధ్యాశాఖ అధికారి చేతులు మీధుగా సన్మానము , ప్రశంసాపత్రము పొందినారు .
- శ్రీకాకులం జిల్లా సాక్షరతా సమితి ' అక్షర క్రాంతి ' సంపాదకీయునిగా ఉత్తం సేవలందించిన సందర్భముగా కలెక్టర్ పునీఠా ద్వారా సత్కారము .
- ఉత్తం కళాకారునిగా సాహితీ మిత్ర మండలి నుంచి 2003 లో పురష్కారము ,
- ఘంటశాల చిత్రాన్ని పోస్టల్ స్టాంపు గా డిజైన్ రూపొందించినందుకు 2003 లో రాస్ట్ర తపలాశాఖ వారి నుంచి ప్రశంసాప్రత్రము , నగదు బహుమతి పొందినారు .
మూలము : ఈనాడు దినపత్రిక ... శ్రీకాకుళం ఎడిషన్.
- ==============================================
No comments:
Post a Comment